పర్యావరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పర్యావరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2010, మంగళవారం

పోలవరం కు అడ్డుకట్ట ఆదివాసీలపాలిట వరం

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పోలవరం అనుమతులపై షోకాజ్ నోటీసును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని ప్రశ్నించిందన్న వార్త పర్యావరణ అభిమానులకు కాసింత ఊరటనిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి పోలవరాన్ని సాధించి తీరుతానని ప్రకటించి ఆదివాసీల, మత్స్యకారుల, సాధారణ రైతులు, ముంపునకు గురయ్యే భూమిపుత్రుల రోదనను పెడచెవిన పెట్టి జాతీయ హోదాకోసం తీవ్రంగా ప్రయత్నించి ప్రజల, పర్యావరణ వేత్తల సూచనలను పట్టించుకోలేదు. సుమారు 5 లక్షలమంది ప్రజలను నిర్వాసితులుగా మార్చే ఈ భారీ ప్రాజెక్టు గర్భంలో కలిసిపోయే సహజ సంపదను ఎలా వెలకట్టగలరు. భారీ ప్రాజెక్టుల మూలంగా భూకంపాలొస్తున్నాయన్న సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు అనుమతులు రాకముందే కాల్వల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ఆమ్యామ్యాలు మింగుతున్న వారికిది మింగుడుపడదు. అటు ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు తమ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రజల విజ్నప్తులను సుప్రీంకోర్టునకు విన్నవించి యున్నారు. అసలు ఇన్ని ఆటంకాల నడుమ వున్న ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలరు. ఓ 2000 ఎకరాలకు నీరందించే జంఘావతి ప్రాజెక్ట్, వంశధార రెండో దశలే ఒరిస్సావారి అభ్యంతరాలతో మూలన పడ్డాయి. అలాంటిది నిర్వాసితులౌతున్న వారి దగ్గరనుంచి, పొరుగు రాష్ట్రాల వారి అభ్యంతరాలతో ఎలా పూర్తి చేస్తారు. తమ ఫాక్షన్ పోకడలతో ఏదీ చెవినెక్కని వారికి తప్ప మిగిలిన వారికేమైంది. ప్రజల సుఖ సంతోషాలు నిజంగా కోరే వారైతే పర్యావరణ నిపుణుల సలహాలను పాటించి చిన్న చిన్న బ్యారేజీలను నిర్మించడం ద్వారా త్వరగా సాగునీరు అందించి అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇందుకు టి.హనుమంతరావు వంటివారి సలహాలను, సూచనలను పాటించమని విన్నపం. పంతాలకు పోయి ప్రజలను నిర్వాసితులను చేసి, సామాజిక అంతరాలను పెంచడంద్వారా, భవిష్యత్తులో అటు సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం అసాధ్యం కావచ్చు.

నియాంగిరీ పర్వత శ్రేణులలోని 2000 మంది గిరిజనుల పోరాటాన్ని కీర్తించి వారికి సైనికుడిగా ప్రకటించుకున్న కాంగ్రెస్ యువరాజు ఇక్కడి 5 లక్షల మంది నిర్వాసితుల గోడు వినమని విజ్నప్తి చేస్తున్నాం..

Polavrm Article

Barrages Are Better Way
>

24, ఆగస్టు 2010, మంగళవారం

వేదాంతపై కోంధ్ ల విజయం



భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఇటీవల వార్తలకెక్కిన అగర్వాల్ యొక్క వేదాంత గ్రూపు ఒడిస్సాలో తలపెట్టిన బాక్సైట్ మైనింగ్, ఫ్యాక్టరీలకు కేంద్ర పర్యావరణ కమిటీ అంతర్జాతీయంగాను, దేశ పర్యావరణ ప్రజాస్వామ్య వాదుల వత్తిడికి తలొగ్గి అనుమతులను రద్దు చేసుకోవడం ప్రజా విజయంగానే గుర్తించాలి. లంజిఘర్ లో 1.7 బిలియన్ డాలర్ల బాక్సైట్ మైనింగ్ వలన అక్కడ స్థానికులైన అరుదైన తెగ కేవలం 8,000 మంది మాత్రమే మిగిలిన కోంధ్ గిరిజనుల ఉనికికే ప్రమాదంగా మారి, వారి ఆరాధ్య దేవతైన నియాంగిరీ కొండ అదృశ్యమయ్యే ప్రమాదాన్ని వాళ్ళు ముందుగానే పసిగట్టి అవతార్ సినిమాలోని తెగ పోరాటంవలే సామ్రాజ్య దళారీలను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా తమ పోరాటాన్ని, నిరసనను ప్రచారం చేయడంతో కేంద్రం దిగివచ్చి వేదాంతకు అనుమతులు నిరాకరించింది. కానీ, దళారీ కార్పొరేట్ పాలకుల తొత్తు అయిన ఒడిస్సా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులనుమతికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కనుక ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ వాదులు, మేధావులు కోంధ్ ల నిజమైన అవతార్ తరహా పోరాటాన్ని సమర్థిస్తూ వేదాంతను అడ్డుకొనేందుకు ముందుకు రావాలి.

30, మే 2010, ఆదివారం

సెల్ సిగ్నల్స్ వలన ఆహార భద్రతకు ముప్పు



ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వలన, పురుగు మందుల కారణంగా తేనెటీగల కాలనీలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం సెల్ ఫోన్ విడుదల చేస్తున్న విద్యుదయస్కాంత రేడియేషన్ వలన కూడా ఉంటుందని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గమనించారు. సెల్ ఫోన్ రేడియేషన్ తేనెటీగల శరీరంలో ఉండే అయస్కాంతత్వంపై ప్రభావం చూపడం వలన తేనెటీగల సామర్థ్యం దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగాల కారణంగా తేనెటీగల తేనె సేకరించే సామర్థ్యం దెబ్బతిన్నట్లు కేరళకు చెందిన సయినుద్దీన్ పట్టాజే చేసిన అధ్యయనంలో కూడా వెల్లడైంది. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే సహజంగా జరిగే పరపరాగ సంపర్కం మందగించిపోతుందని, దీంతో కాయలు, పళ్ళ చెట్ల ఉనికి నశించి, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పిచ్చుకలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షిజాతులు సెల్ సిగ్నల్స్ వలన అంతరించిపోతున్నాయి. అలాగే వీటి వలన మన మెదడుపై కూడా దుష్ప్రభావాలు చాల వున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ సంబంధాలపై చూపుతున్న దుష్ప్రభావాలు మన గ్రహింపులో వున్నా మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సెల్ ను ప్రస్తుతం వినియోగించకుండా ఆపే స్థితిలో లేము కాబట్టి దీనికి ప్రత్యామ్యాయ పద్ధతులపై నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు దృష్తి సారించకపోతే ఈ సెల్ ద్వాపరయుగంలోని ముసలంలా మన యుగాన్ని అంతం చేసె మహమ్మారి కాగలదు.


(ఆంధ్రజ్యోతి 29.05.2010 వార్త ఆధారంగా)

12, మార్చి 2010, శుక్రవారం

ఉత్తరాంధ్ర అవతార్




ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ తే.13-03-10దీ.