
ఈ దశాబ్ధంలోనే అతి పెద్ద ప్రమాదం, భారత్ లో జరిగిన మూడో ఘోర ప్రమాదంగా అందరిని కలచివేసిన మంగళూరు విమాన ప్రమాదం. ఎవరి తప్పిదంవలన జరిగినా 167 నిండు ప్రాణాలను బలిగొన్నారు.
ఈ మధ్య ఏదైనా సంఘటన జరిగితే రాజీనామా చేస్తాననడం మన మంత్రివర్యులకు ఫ్యాషన్ అయ్యింది. ఎలాగూ ఆమోదించరని తెలిసి ఈ నాటకం. ఎంత ఎక్స్ గ్రేషియా ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. ఆ కొండలు గుట్టలలో విమానాశ్రయం, చిన్న రన్ వే పై భారీ విమానాలను దించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.
సంతాప తీర్మానాలు కాదు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్ తరాలకు నిబ్బరాన్నివ్వాలని కోరుకుందాం.. యిది అత్యాశేనా?..