విషాదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విషాదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మార్చి 2011, శుక్రవారం

విలయం..



కట్టుకున్నవన్నీ

పేకమేడలా
కూలిపోయిన
క్షణం...

మాటాడుకుంటున్న

మా మధ్య విరిగిపడిన

పైకప్పు...


వేలి చివరాశరాతో

నడుస్తున్న
చిన్నారిని

మింగేసిన అల...


కాలికింద
చీలిపోయిన

నేల తల్లి
నిర్దయగా
మమ్మల్ని

మింగేసి
ఖాళీని
పూరించుకున్న

దుర్దినం...


ఇంత దయలేనితనం

మా మీదనేల తల్లీ

చూపావు?

7, జూన్ 2010, సోమవారం

పాతికేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చారు..

భూమ్మీద జరిగిన అత్యంత విషాదకర, వినాశకర సంఘటనగా పేర్కొనబడ్డ భోపాల్ గాస్ దుర్ఘటనపై ఈ రోజు స్థానిక కోర్టు యిచ్చిన తీర్పు బాధితులకు యిన్నేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చింది. కేసులో వున్న నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా మరి 7 గురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళకు 3500 మందికి పైగా చావుకు, అనేక వేల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమైన వారికి రెండు సం.ల కారాగార శిక్ష కొంత మొత్తం జరిమానా విధించవచ్చని తెలుస్తోంది. అసలు దోషిఅయిన కంపెనీ చైర్మన్ వారన్ ఆండర్సన్ ను పరారీలో వున్న నిందితుడుగా చూపిస్తున్నారు. ఇదీ మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుల ప్రతిఫలం. డబ్బు, అధికారం వున్న వారినేం చేయలేనితనం. సామ్రాజ్యవాదులకు దాసోహమైన బానిసతనం. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు సరైన పరిహారమే అందలేదన్నది సత్యదూరం కాదు. ఇలాంటి వ్యవస్థలున్న చోట అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అత్యుత్సాహం చూపుతున్న మన పాలక వర్గం ఖర్మ కాలి ఏదైనా జరిగితే దేశంలో జనాభా తగ్గిందిలే అని సంతృప్తి పడతారేమో. సరైన రక్షణ కార్యాచరణ లేకుండా, పర్యావరణం నాశనమయ్యి జనావళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న కాలంలో వున్న మనం యిటువంటి కర్మాగారాలకు, ప్రాజెక్టులకు, వినాశకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరమే కాదు ఈ తరంకూడా భూమ్మీద బతికే చాన్సు ఉండదు, కొత్త కొత్త జబ్బులతో నరకయాతన పడక తప్పని స్థితి ఎంతో దూరంలో లేదు.

భోపాల్ మృతులకు మరోమారు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి వారసుల పోరాటానికి మద్దతునిద్దాం..



http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/7807904/Bhopal-managers-face-prison-for-role-in-Union-Carbide-gas-disaster.html

http://news.rediff.com/slide-show/2010/jun/07/slide-show-1-bhopal-gas-tragedy-verdict.htm

22, మే 2010, శనివారం

ఈ దశాబ్ధపు ఘోర విషాదం



ఈ దశాబ్ధంలోనే అతి పెద్ద ప్రమాదం, భారత్ లో జరిగిన మూడో ఘోర ప్రమాదంగా అందరిని కలచివేసిన మంగళూరు విమాన ప్రమాదం. ఎవరి తప్పిదంవలన జరిగినా 167 నిండు ప్రాణాలను బలిగొన్నారు.

ఈ మధ్య ఏదైనా సంఘటన జరిగితే రాజీనామా చేస్తాననడం మన మంత్రివర్యులకు ఫ్యాషన్ అయ్యింది. ఎలాగూ ఆమోదించరని తెలిసి ఈ నాటకం. ఎంత ఎక్స్ గ్రేషియా ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. ఆ కొండలు గుట్టలలో విమానాశ్రయం, చిన్న రన్ వే పై భారీ విమానాలను దించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.

సంతాప తీర్మానాలు కాదు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్ తరాలకు నిబ్బరాన్నివ్వాలని కోరుకుందాం.. యిది అత్యాశేనా?..