21, ఏప్రిల్ 2010, బుధవారం

ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్



నిన్నటి వైట్ హోస్ మీడియా సమావేశంలో సెక్రటరీ రాబర్ట్ గిబ్స్ మరో మారు బిన్ లాడెన్ ను సజీవంగానైనా, శవంగానైనా పట్టుకుంటామని భీషణ ప్రతిజ్ఞా చేశారు. ఇది ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ గా అనిపిస్తోంది. 9 /11 2001 తరువాత నుండి ఈ ప్రతినలు వింటూనే వున్నాం. ఈ పేరుతొ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలపై కార్పెట్ బాంబింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. దీనికి ప్రతీకారంగా వాళ్ళు మానవ బాంబులతో దాడులు చేస్తూ అమాయక ప్రానాలరిస్తున్నారు. ఇప్పటికే అమెరికన్ సైనికులు అసహనానికి గురికాబడుతున్నారు. వారిని ఉత్తెజపరిచేమ్దుకు ఒబామా కూడా పరామర్షి౦చాల్సి వస్తోంది. సైన్యాన్ని ఉపసంహరిస్తానన్న వాగ్ధానంతో అమ్దలమేక్కిన ఒబామా అది మరిచిపోయాడు. అది ఒబామాకు సాధ్యమా? అసలు అమెరికన్ సామ్రాజ్యం సైనిక, ఆయుధ వ్యాపారంతో ముడిపడి వున్నది. పులి మాంసాహారం మానేసానన్నట్లు వుంటుంది ఇలాంటి మాటలు.

12, మార్చి 2010, శుక్రవారం

ఉత్తరాంధ్ర అవతార్




ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ తే.13-03-10దీ.

4, మార్చి 2010, గురువారం

టెక్టోనిక్ - భూకంపాయుధం



మొన్నటి హైతీ భూకంపానికి కారణం హైతీకి దగ్గరలో భూకంపం సృష్టించే ఆయుధాల్ని ప్రయోగం చెయ్యడం వల్లనే ఈ పరిణామం సంభావిమ్చినదని వెనెజులా అధ్యక్షుడు చావెజ్ ఆరోపిస్తున్నారు. ప్రక్రుతి విలయం ముసుగులో హైతీని ఆక్రమించాలని అమెరికా చూస్తున్నట్లుగా ఆయన ఇంతకుముందే ప్రకటించారు. వాతావరణంలో తీవ్రమైన మార్పులను తేగల హాయ్ ఫ్రీక్వెన్సీ ఆక్టివ్ ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం (HAARP) కి సంబంధించినది. 1997లో అమెరికా మాజీ రక్షణమంత్రి కొన్ని దేశాలు విద్యుదయస్కాంత తరంగాల ద్వారా భూకంపాలని ప్రేరేపించడానికి, అగ్నిపర్వతాలని పేల్చడానికీ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఆ దేశాలు వాతావరణ సంబంధమైన ఉగ్రవాదంలో నిమగ్నమై ఉన్నాయని ఆరోపించారు. హైతీ భూకంపానికి అమెరికా చేసిన TECTONIC ఆయుధాన్ని ప్రయోగించి చూడటమే కారణంగా చావెజ్ చెబుతున్నారు. యిది కేవలం ప్రయోగం మాత్రమే అసలు లక్ష్యం ఇరాన్ గా చెబుతున్నారు. దీన్ని భూకంపాయుధం అంటున్నారు. అమెరికా, రష్యాలవద్ద యిలాంటి ఆయుధాలున్నాయని చెబుతున్నారు. ప్రపంచ దేశాలను భయపెట్టడానికే అమెరికా యిటువంటి ఆయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడటంలేదు.

ప్రపంచంలోనే స్వాతంత్రం సాధించుకున్న మొట్టమొదటి నల్లజాతి దేశం హైతీ. హైతీ విప్లవకాలంలో ఫ్రెంచ్ వలసల్లో అత్యంత సంపన్నమైనది. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా అది తన స్వాతంత్రాన్ని 1804 జనవరి 1న తిరుగుబాటుద్వారా అది స్వేచ్చను పొందింది. ఆ తిరుగుబాటు ఇతర దేశాలలోని బానిసలను మేల్కొలుపుతుందని అమెరికా, ఫ్రాన్స్ లు హైతీని ప్రపంచదేశాలలో ఒంటరిని చేసాయి. ఆ తరువాత హైతీని ఆర్థిక దిగ్భంధంలో అనేక సంల పాటు వుంచాయి. అక్కడ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి తమ ఏజెంట్లతో పరిపాలన సాగిస్తోంది అమెరికా. అమెరికా దుస్తుల తయారీ పరిశ్రమకు అతి చౌకగా హైతీయన్లను వాడుకుంటుంది. హైతీనుంచి అమెరికాలోకి పోయేవాళ్ళని అక్కడి ప్రభుత్వం శిక్షించేలా శాశిస్తున్నారు. ప్రస్తుతం ఒబామా క్లింటన్, బుష్ లను తన దూతలుగా హైతీ బాధ్యతలు అప్పగించాడు.

భూకంపాయుధాల ప్రయోగం కారణంగానే యిటీవలి భూకంప ప్రళయాలు జరుగుతున్నాయని, యిది వాతావరణ సంబంధ ఉగ్రవాదాన్ని సరికొత్తగా ప్రయోగిస్తూ ప్రపంచదేశాలను అమెరికా తన గుప్పెట్లో వుంచుతోంది. దీనిని అంతా ఖండించాలని కోరుకుందాం!

ఈ లింక్ లలో కొంత రిపోర్టు వుందిః1.http://boingboing.net/2010/01/22/venezuelan-president.html
2. http://uswgo.com/i-believe-the-incident-at-haiti-was-caused-by-a-tectonic-weapon.htm

(ఈ సమాచారం వీక్షణం ఫిబ్రవరి 2010 సంచికలో హైతీ భూకంపం - అమెరికా సామ్రాజ్యవాదం, రచయిత E.S.బ్రహ్మచారి ద్వారా గ్రహించడమైనది)

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆఫ్ఘన్ భూభాగంపై నాటో మారణకాండ



ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఏరివేత పేరుతో ఇప్పటికే టన్నులకొద్ది బాంబు దాడులు చేస్తున్న నాటో దళాలు గత వారం రోజుల్లో సుమారు 50 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసాయి. మజ్రా ప్రాంతంలో మొన్న జరిగిన వైమానిక దాడిలో మూడు జీపులలో వెళ్తున్న సామాన్య పౌరులు 27 మంది చనిపోయారు. దీనిపై ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో తమ కీలుబొమ్మ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దీనిని ఖండిస్తూ సివిలియన్ మరణాలు లేకుండా చూడమని మొత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా నాటో కమాండర్ క్శమాపణలు చెప్పాడు. సారీ చెప్పినంత మాత్రాన వారి ప్రాణాలు తిరిగివస్తాయా? ఆఫ్ఘనిస్తాన్ పై గత 30 ఏళ్ళకు పైగా పరాయి దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక గిరిజనులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అగ్రరాజ్యం దాని ఫలితాన్ని అనుభవిస్తోంది. తిరిగి అదే ఉగ్రవాదాన్ని రూపుమాపుతానని అక్కడి ప్రజల మాన ప్రాణాలను హరిస్తోంది. ఎవరి భూభాగం వారు పాలించుకునే స్వేచ్చ లేకుండా తమ అవసరాలు తీర్చుకొనడానికి దురాక్రమణలు చేసి, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, తమ సొంత కీలుబొమ్మ పాలకులతో నడిపించి తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకునే అగ్రరాజ్య దురహంకారాన్ని వ్యతిరేకించాలి. దానికి వత్తాసు పలికే నాటో సభ్యదేశాల కుటిల రాజనీతిని బయటపెట్టాలి.

17, ఫిబ్రవరి 2010, బుధవారం

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా?




తన రచనల ద్వారా మాతృదేశ బహిష్కరణకు గురై ప్రస్తుతం తానూ తన దేశంకంటే ఎక్కువగా అభిమానించే ఈ సువిశాల భారత దేశంలో తనకు నీడనిమ్మని దీనంగా వేడుకుంటున్న తస్లీమాను ఏ ప్రయోజనాలకు బలిచేస్తున్నారో? ముస్లిం వర్గం నుండి వచ్చిన బెదిరింపులకు లొంగి ఆమెకు జాగా లేకుండా చేయడం మానవత్వమా? ఇది మన అత్యంత భారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? హైదరాబాదులో తనపై దాడిచేసిన వారు అలా స్వేచ్చగా, ఎటువంటి కేసులు లేకుండా తిరగుతున్నారంటే మనది ఎంత ఓట్ల రాజకీయమో అర్థమౌతో౦ది.

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా? ఓ ఆడకూతురిని రక్షించుకోలేమా?

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

విషపు వంగడం పై జన విజయం



దేశ వ్యాప్తంగా ప్రజలనుండి, శాస్త్రవేత్తలనుండి వచ్చిన బలమైన వ్యతిరేకతకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ప్రస్తుతానికి బీ.టీ, వంగ వంగడాల ప్రయోగానికి అడ్డు చెప్పింది. దీనివలన వచ్చే అదనపు దిగుబడి ఏమీ లేకపోయిన ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వస్తుందని తెలిసినా కూడా దీనిని ప్రవేశ పెట్ట చూడడం పాలకవర్గాల విదేశీ శక్తులకు దాస్య మనస్తత్వానికి నిదర్శనం. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, N.G.Os., దీనివలన లాభంకంటే నష్టం ఎక్కువని విడమరిచి చెప్పి మొత్తుకున్నా కేంద్ర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. అయినా మొక్కవోని దీక్షతో తమ నిరసనను, వ్యతిరేకతను తెలియచేయడంతో కేంద్రం నో చెప్పింది. అయినా అంతా అప్రమత్తంగా వుండి యిటువంటి విషప్రయోగాలనుండి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక్కడ మరిన్ని వివరాలు చూడొచ్చుఃhttp://economictimes.indiatimes.com/news/economy/agriculture/Government-decides-against-Bt-Brinjal-for-now/articleshow/5552374.cms

4, ఫిబ్రవరి 2010, గురువారం

మన నేలను విషపూరితం చేస్తున్నారు

ఈ మధ్య కేంద్ర మంత్రివర్యులు జైరాం రమేష్ గారు ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతొ బి.టి. వంగాదాలపై ఆమోద ముద్ర కోసం సమావేశాలు పెడుతున్నారు. ప్రతి చోటా రైతు సోదరులు, శాస్త్రవేత్తలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ వారి మాట వినేవారేవ్వరు. కిరాయి రైతులను ముందుగా మాటాడి౦చి అదే రికార్డు చేసుకు పోతున్నట్లుగా వుంది. ఏదో అంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్సాకంగా చేస్తున్నట్లు భ్రమలు కల్పించే కార్యక్రమం తప్ప ఇది మరోటి కాదు. సెజ్ లకు ఆమోదం కోసం కూడా ఇలానే మీటింగులు చేసారు. కానీ తరువాత మన మాట ఎక్కడా అమలుకాబడలేదు. ఇది కూడా అలానే చేస్తున్నారు. బి.టి పత్తి సాగుచేసిన నెల బీడుగా మార్చబడుతో౦ది. అధిక ఉత్పత్తి పేరుతొ ఈ విషాన్ని మనలాంటి 3 వ ప్రపంచ దేశాలలో ప్రయోగిస్తున్నారు. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో అసంఘటిత రైతులున్న దగ్గర ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని గాట్ ఒప్పందంలో భాగంగా అమలుచేయజూస్తున్నారు. వంకాయకూర విరివిగా వినియోగించే మనం ఈ బీ.టీ.వంగడం ద్వారా వుత్పత్తి అయిన దానిని ఆహారంగా వినియోగిస్తే కాన్సర్ వంటి రోగాలబారిన పడతారని వ్యవాసాయ శాస్త్రవేత్తలుకూడా హెచ్చరిస్తున్నా, పాలక వర్గం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జన్యుపరమైన జబ్బులకు లోనయితే యిప్పటికే అరకొర వైద్య సౌకర్యాలున్న మన ప్రజలకు దిక్కెవరు. వుత్పత్తి పెంచి ఎవరికి మేలుచేయజూస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, వ్యవసాయం జూదంగా మారిన నేడు రైతుసోదరులతో పాటు, అవి వినియోగించే ప్రజల ఆరోగ్యంకు ఎవరు బాధ్యతవహిస్తారు? ప్రపంచీకరణ, సరళీకరణలపేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలు నేడు అడ్డుకునే స్థితిలో లేని సమయంలో అమలుజరుగుతున్న ఈ వ్యాపారవర్గాల మోసపూరిత కుట్రను ఆపేదెవరు? సామాన్యుడివైపు నిలిచేదెవరు? అభివృద్ధి పేరుతో జరుగుతున్న యీ రకమైన పాలకవర్గాల దళారీ కుట్రను ప్రజాస్వామికవాదులు, మేధావివర్గం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. మనకున్న వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇప్పటికే వ్యవసాయం నుండి సన్నకారు, చిన్నకారు రైతులు దూరంచేయబడుతున్నారు. ఈ కార్పొరేట్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.