2, జులై 2010, శుక్రవారం

ఈ ఫోటో ఓ పెద్ద వ్యాసానికి సమానం



ఈ కింది లింక్ లలో వివరాలు చూడొచ్చుః
The Great Indian Clearance Sale
Based on Center for Science and Environment's report on mining: http://www.cseindia.org/node/435
http://www.facebook.com/afsarm?v=wall&story_fbid=134092203279686#!/greatindiansale

14, జూన్ 2010, సోమవారం

ద.ఆఫ్రికాను ముంచే ప్రయత్నం..



ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశాలన్నీ కుదేలైపోతున్న సమయంలో ద.ఆఫ్రికా వంటి తృతీయ ప్రపంచ దేశం, కొద్ది సం.ల క్రితం వరకు వలస బానిసత్వంలో మగ్గిన దేశం ఏం అభివృద్ధి సాధించిందని సాకర్ క్రీడలను వేలకోట్ల పెట్టుబడితో నిర్వహించాలనుకుంది. యూరోప్, పశ్చిమ దేశాల కుట్రలో ఇది కూరుకుపోయి ఈ భారాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. తాము నిర్వహించి చేతులు కాల్చుకోకుండా ఇలా ఒక నిర్భాగ్య దేశాన్ని బలిచేసి మరో సోమాలియాగా మార్చేయడానికి పన్నాగంగా అనిపిస్తోంది.

ఇంతకు ముందు ఇండియాలో ఆసియాక్రీడలు నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. దీని నిర్వహణ వలన వచ్చిన ఆదాయమూలేదు, కొత్తగా వచ్చేసిన పతకాలూ లేవు. ఇలాంటిదే మరల అక్కడ జరుగుతోంది. ఆ దేశం గొప్పగా చెప్పుకునే క్రీడాకారులు గానీ, వాళ్ళు సంపాదించిన అంతర్జాతీయ స్థాయి పతకాలూ లేవు. మరి ఏమాశించి ఈ క్రీడలు జరప నిర్ణయం తీసుకున్నారో. అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రజలు మరో దశాబ్ధం పాటు వెనకబడడం ఖాయం. ఇలా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే ముందు తమ స్థాయిని గుర్తెరిగి నిర్వహిస్తే మంచిది. లేకపోతే భవిష్యత్ తరాలు వీళ్ళ నిర్వాకానికి అడుక్కు తినాలి.

ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అరువు క్రీడాకారులతో బాబు కూడా ఇలానే జాతీయ క్రీడలు నిర్వహించారు. దాంతో మరింత అప్పులు పెరిగాయి తప్ప మరేమీ లేదు.

ఇదంతా ప్రజలను అథఃపాతాళానికి తొక్కే రాజకీయ నాయకుల క్రీడా విన్యాసాలు తప్ప మరేమీ కాదు. ఆఫ్రికా వాసులారా బహు పరాక్.

7, జూన్ 2010, సోమవారం

పాతికేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చారు..

భూమ్మీద జరిగిన అత్యంత విషాదకర, వినాశకర సంఘటనగా పేర్కొనబడ్డ భోపాల్ గాస్ దుర్ఘటనపై ఈ రోజు స్థానిక కోర్టు యిచ్చిన తీర్పు బాధితులకు యిన్నేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చింది. కేసులో వున్న నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా మరి 7 గురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళకు 3500 మందికి పైగా చావుకు, అనేక వేల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమైన వారికి రెండు సం.ల కారాగార శిక్ష కొంత మొత్తం జరిమానా విధించవచ్చని తెలుస్తోంది. అసలు దోషిఅయిన కంపెనీ చైర్మన్ వారన్ ఆండర్సన్ ను పరారీలో వున్న నిందితుడుగా చూపిస్తున్నారు. ఇదీ మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుల ప్రతిఫలం. డబ్బు, అధికారం వున్న వారినేం చేయలేనితనం. సామ్రాజ్యవాదులకు దాసోహమైన బానిసతనం. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు సరైన పరిహారమే అందలేదన్నది సత్యదూరం కాదు. ఇలాంటి వ్యవస్థలున్న చోట అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అత్యుత్సాహం చూపుతున్న మన పాలక వర్గం ఖర్మ కాలి ఏదైనా జరిగితే దేశంలో జనాభా తగ్గిందిలే అని సంతృప్తి పడతారేమో. సరైన రక్షణ కార్యాచరణ లేకుండా, పర్యావరణం నాశనమయ్యి జనావళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న కాలంలో వున్న మనం యిటువంటి కర్మాగారాలకు, ప్రాజెక్టులకు, వినాశకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరమే కాదు ఈ తరంకూడా భూమ్మీద బతికే చాన్సు ఉండదు, కొత్త కొత్త జబ్బులతో నరకయాతన పడక తప్పని స్థితి ఎంతో దూరంలో లేదు.

భోపాల్ మృతులకు మరోమారు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి వారసుల పోరాటానికి మద్దతునిద్దాం..



http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/7807904/Bhopal-managers-face-prison-for-role-in-Union-Carbide-gas-disaster.html

http://news.rediff.com/slide-show/2010/jun/07/slide-show-1-bhopal-gas-tragedy-verdict.htm

30, మే 2010, ఆదివారం

సెల్ సిగ్నల్స్ వలన ఆహార భద్రతకు ముప్పు



ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వలన, పురుగు మందుల కారణంగా తేనెటీగల కాలనీలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం సెల్ ఫోన్ విడుదల చేస్తున్న విద్యుదయస్కాంత రేడియేషన్ వలన కూడా ఉంటుందని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గమనించారు. సెల్ ఫోన్ రేడియేషన్ తేనెటీగల శరీరంలో ఉండే అయస్కాంతత్వంపై ప్రభావం చూపడం వలన తేనెటీగల సామర్థ్యం దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగాల కారణంగా తేనెటీగల తేనె సేకరించే సామర్థ్యం దెబ్బతిన్నట్లు కేరళకు చెందిన సయినుద్దీన్ పట్టాజే చేసిన అధ్యయనంలో కూడా వెల్లడైంది. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే సహజంగా జరిగే పరపరాగ సంపర్కం మందగించిపోతుందని, దీంతో కాయలు, పళ్ళ చెట్ల ఉనికి నశించి, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పిచ్చుకలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షిజాతులు సెల్ సిగ్నల్స్ వలన అంతరించిపోతున్నాయి. అలాగే వీటి వలన మన మెదడుపై కూడా దుష్ప్రభావాలు చాల వున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ సంబంధాలపై చూపుతున్న దుష్ప్రభావాలు మన గ్రహింపులో వున్నా మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సెల్ ను ప్రస్తుతం వినియోగించకుండా ఆపే స్థితిలో లేము కాబట్టి దీనికి ప్రత్యామ్యాయ పద్ధతులపై నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు దృష్తి సారించకపోతే ఈ సెల్ ద్వాపరయుగంలోని ముసలంలా మన యుగాన్ని అంతం చేసె మహమ్మారి కాగలదు.


(ఆంధ్రజ్యోతి 29.05.2010 వార్త ఆధారంగా)

22, మే 2010, శనివారం

ఈ దశాబ్ధపు ఘోర విషాదం



ఈ దశాబ్ధంలోనే అతి పెద్ద ప్రమాదం, భారత్ లో జరిగిన మూడో ఘోర ప్రమాదంగా అందరిని కలచివేసిన మంగళూరు విమాన ప్రమాదం. ఎవరి తప్పిదంవలన జరిగినా 167 నిండు ప్రాణాలను బలిగొన్నారు.

ఈ మధ్య ఏదైనా సంఘటన జరిగితే రాజీనామా చేస్తాననడం మన మంత్రివర్యులకు ఫ్యాషన్ అయ్యింది. ఎలాగూ ఆమోదించరని తెలిసి ఈ నాటకం. ఎంత ఎక్స్ గ్రేషియా ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. ఆ కొండలు గుట్టలలో విమానాశ్రయం, చిన్న రన్ వే పై భారీ విమానాలను దించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.

సంతాప తీర్మానాలు కాదు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్ తరాలకు నిబ్బరాన్నివ్వాలని కోరుకుందాం.. యిది అత్యాశేనా?..

21, ఏప్రిల్ 2010, బుధవారం

ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్



నిన్నటి వైట్ హోస్ మీడియా సమావేశంలో సెక్రటరీ రాబర్ట్ గిబ్స్ మరో మారు బిన్ లాడెన్ ను సజీవంగానైనా, శవంగానైనా పట్టుకుంటామని భీషణ ప్రతిజ్ఞా చేశారు. ఇది ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ గా అనిపిస్తోంది. 9 /11 2001 తరువాత నుండి ఈ ప్రతినలు వింటూనే వున్నాం. ఈ పేరుతొ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలపై కార్పెట్ బాంబింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. దీనికి ప్రతీకారంగా వాళ్ళు మానవ బాంబులతో దాడులు చేస్తూ అమాయక ప్రానాలరిస్తున్నారు. ఇప్పటికే అమెరికన్ సైనికులు అసహనానికి గురికాబడుతున్నారు. వారిని ఉత్తెజపరిచేమ్దుకు ఒబామా కూడా పరామర్షి౦చాల్సి వస్తోంది. సైన్యాన్ని ఉపసంహరిస్తానన్న వాగ్ధానంతో అమ్దలమేక్కిన ఒబామా అది మరిచిపోయాడు. అది ఒబామాకు సాధ్యమా? అసలు అమెరికన్ సామ్రాజ్యం సైనిక, ఆయుధ వ్యాపారంతో ముడిపడి వున్నది. పులి మాంసాహారం మానేసానన్నట్లు వుంటుంది ఇలాంటి మాటలు.

12, మార్చి 2010, శుక్రవారం

ఉత్తరాంధ్ర అవతార్




ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ తే.13-03-10దీ.