24, ఆగస్టు 2010, మంగళవారం

వేదాంతపై కోంధ్ ల విజయం



భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఇటీవల వార్తలకెక్కిన అగర్వాల్ యొక్క వేదాంత గ్రూపు ఒడిస్సాలో తలపెట్టిన బాక్సైట్ మైనింగ్, ఫ్యాక్టరీలకు కేంద్ర పర్యావరణ కమిటీ అంతర్జాతీయంగాను, దేశ పర్యావరణ ప్రజాస్వామ్య వాదుల వత్తిడికి తలొగ్గి అనుమతులను రద్దు చేసుకోవడం ప్రజా విజయంగానే గుర్తించాలి. లంజిఘర్ లో 1.7 బిలియన్ డాలర్ల బాక్సైట్ మైనింగ్ వలన అక్కడ స్థానికులైన అరుదైన తెగ కేవలం 8,000 మంది మాత్రమే మిగిలిన కోంధ్ గిరిజనుల ఉనికికే ప్రమాదంగా మారి, వారి ఆరాధ్య దేవతైన నియాంగిరీ కొండ అదృశ్యమయ్యే ప్రమాదాన్ని వాళ్ళు ముందుగానే పసిగట్టి అవతార్ సినిమాలోని తెగ పోరాటంవలే సామ్రాజ్య దళారీలను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా తమ పోరాటాన్ని, నిరసనను ప్రచారం చేయడంతో కేంద్రం దిగివచ్చి వేదాంతకు అనుమతులు నిరాకరించింది. కానీ, దళారీ కార్పొరేట్ పాలకుల తొత్తు అయిన ఒడిస్సా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులనుమతికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కనుక ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ వాదులు, మేధావులు కోంధ్ ల నిజమైన అవతార్ తరహా పోరాటాన్ని సమర్థిస్తూ వేదాంతను అడ్డుకొనేందుకు ముందుకు రావాలి.