2, నవంబర్ 2010, మంగళవారం

పోలవరం కు అడ్డుకట్ట ఆదివాసీలపాలిట వరం

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పోలవరం అనుమతులపై షోకాజ్ నోటీసును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని ప్రశ్నించిందన్న వార్త పర్యావరణ అభిమానులకు కాసింత ఊరటనిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి పోలవరాన్ని సాధించి తీరుతానని ప్రకటించి ఆదివాసీల, మత్స్యకారుల, సాధారణ రైతులు, ముంపునకు గురయ్యే భూమిపుత్రుల రోదనను పెడచెవిన పెట్టి జాతీయ హోదాకోసం తీవ్రంగా ప్రయత్నించి ప్రజల, పర్యావరణ వేత్తల సూచనలను పట్టించుకోలేదు. సుమారు 5 లక్షలమంది ప్రజలను నిర్వాసితులుగా మార్చే ఈ భారీ ప్రాజెక్టు గర్భంలో కలిసిపోయే సహజ సంపదను ఎలా వెలకట్టగలరు. భారీ ప్రాజెక్టుల మూలంగా భూకంపాలొస్తున్నాయన్న సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు అనుమతులు రాకముందే కాల్వల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ఆమ్యామ్యాలు మింగుతున్న వారికిది మింగుడుపడదు. అటు ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు తమ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రజల విజ్నప్తులను సుప్రీంకోర్టునకు విన్నవించి యున్నారు. అసలు ఇన్ని ఆటంకాల నడుమ వున్న ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలరు. ఓ 2000 ఎకరాలకు నీరందించే జంఘావతి ప్రాజెక్ట్, వంశధార రెండో దశలే ఒరిస్సావారి అభ్యంతరాలతో మూలన పడ్డాయి. అలాంటిది నిర్వాసితులౌతున్న వారి దగ్గరనుంచి, పొరుగు రాష్ట్రాల వారి అభ్యంతరాలతో ఎలా పూర్తి చేస్తారు. తమ ఫాక్షన్ పోకడలతో ఏదీ చెవినెక్కని వారికి తప్ప మిగిలిన వారికేమైంది. ప్రజల సుఖ సంతోషాలు నిజంగా కోరే వారైతే పర్యావరణ నిపుణుల సలహాలను పాటించి చిన్న చిన్న బ్యారేజీలను నిర్మించడం ద్వారా త్వరగా సాగునీరు అందించి అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇందుకు టి.హనుమంతరావు వంటివారి సలహాలను, సూచనలను పాటించమని విన్నపం. పంతాలకు పోయి ప్రజలను నిర్వాసితులను చేసి, సామాజిక అంతరాలను పెంచడంద్వారా, భవిష్యత్తులో అటు సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం అసాధ్యం కావచ్చు.

నియాంగిరీ పర్వత శ్రేణులలోని 2000 మంది గిరిజనుల పోరాటాన్ని కీర్తించి వారికి సైనికుడిగా ప్రకటించుకున్న కాంగ్రెస్ యువరాజు ఇక్కడి 5 లక్షల మంది నిర్వాసితుల గోడు వినమని విజ్నప్తి చేస్తున్నాం..

Polavrm Article

Barrages Are Better Way
>