21, ఏప్రిల్ 2011, గురువారం

ధరిత్రీ దినోత్సవం



మన రోజువారీ జీవితంలో వేగంపెరిగిన దృష్ట్యా ప్రతి అంశానికి ఏదో ఒక దినోత్సవం పేరుతో జరుపుకోకపోతే అది ఎంత ప్రాణాంతకమైనదైనా లేక ఎంత అభిమాన పూర్వకమైనదైనా మరిచిపోతుంటాం.. అలాగే మన ఉనికికి అస్తిత్వానికి ఆధారభూతమైన ప్రకృతి భూమిని కాపాడుకోవడం గురించి ఎంతలా చెప్పుకున్నా మన కృషి అటువైపుగా చాలా తక్కువ శాతం మాత్రమే జరుగుతున్నదన్నది విస్పష్టం.. ఇటీవల జపాన్ లో వచ్చిన సునామీ, తుఫాన్ లు, భూకంపాలు మనల్ని ఎంతమాత్రం కదిలించడంలేదు.. భూమి లేకపోతే నిలువనీడలేదన్నది మరిచిపోయి దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాం చేజేతులా... న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ధర్మల్ పవర్ ప్లాంట్లు, నర్మదా, పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేపట్టి ప్రకృతి భీభత్సానికి గురికావడానికి కారకులవుతున్నాం.. మనమంటే మనం కాదు కదా ప్రభువులు ఏలిన వారు చేస్తున్నదానికి మనమేం జేస్తాం అనుకోవచ్చు. కానీ వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనదే... వాళ్ళ వ్యాపార దృక్పథానికి ఏమీ అడ్డురావు. బాక్సైటు తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి మన ఉనికితో పాటు పర్యావరణ కాలుష్యం పెరిగి అటవీ సంపద నాశనమవుతుందని తెలిసినా నియాంగిరీ పర్వత శ్రేణులనుండి ఇటు పాడేరు వరకు తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.. ఇలా మానవుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తున్న వాటిని తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేయకపోతే అస్తిత్వాన్ని కోల్పోతాం.. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం మనపాలిట మృత్యువు అన్నది గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకొని, ప్రకృతి సంతులతను నిలబెట్టే దిశగా ప్రయత్నం తీవ్రతరం చేయక్పోతే ఎన్ని ధరిత్రీ దినోత్సవాలు వచ్చి వెళ్ళినా ప్రయోజనం లేదు...

రండి కలిసి భూమిని కాపాడుకుందాం....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నన్ను మెరుగుపరిచేట్లు...