4, ఫిబ్రవరి 2010, గురువారం

మన నేలను విషపూరితం చేస్తున్నారు

ఈ మధ్య కేంద్ర మంత్రివర్యులు జైరాం రమేష్ గారు ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతొ బి.టి. వంగాదాలపై ఆమోద ముద్ర కోసం సమావేశాలు పెడుతున్నారు. ప్రతి చోటా రైతు సోదరులు, శాస్త్రవేత్తలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ వారి మాట వినేవారేవ్వరు. కిరాయి రైతులను ముందుగా మాటాడి౦చి అదే రికార్డు చేసుకు పోతున్నట్లుగా వుంది. ఏదో అంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్సాకంగా చేస్తున్నట్లు భ్రమలు కల్పించే కార్యక్రమం తప్ప ఇది మరోటి కాదు. సెజ్ లకు ఆమోదం కోసం కూడా ఇలానే మీటింగులు చేసారు. కానీ తరువాత మన మాట ఎక్కడా అమలుకాబడలేదు. ఇది కూడా అలానే చేస్తున్నారు. బి.టి పత్తి సాగుచేసిన నెల బీడుగా మార్చబడుతో౦ది. అధిక ఉత్పత్తి పేరుతొ ఈ విషాన్ని మనలాంటి 3 వ ప్రపంచ దేశాలలో ప్రయోగిస్తున్నారు. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో అసంఘటిత రైతులున్న దగ్గర ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని గాట్ ఒప్పందంలో భాగంగా అమలుచేయజూస్తున్నారు. వంకాయకూర విరివిగా వినియోగించే మనం ఈ బీ.టీ.వంగడం ద్వారా వుత్పత్తి అయిన దానిని ఆహారంగా వినియోగిస్తే కాన్సర్ వంటి రోగాలబారిన పడతారని వ్యవాసాయ శాస్త్రవేత్తలుకూడా హెచ్చరిస్తున్నా, పాలక వర్గం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జన్యుపరమైన జబ్బులకు లోనయితే యిప్పటికే అరకొర వైద్య సౌకర్యాలున్న మన ప్రజలకు దిక్కెవరు. వుత్పత్తి పెంచి ఎవరికి మేలుచేయజూస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, వ్యవసాయం జూదంగా మారిన నేడు రైతుసోదరులతో పాటు, అవి వినియోగించే ప్రజల ఆరోగ్యంకు ఎవరు బాధ్యతవహిస్తారు? ప్రపంచీకరణ, సరళీకరణలపేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలు నేడు అడ్డుకునే స్థితిలో లేని సమయంలో అమలుజరుగుతున్న ఈ వ్యాపారవర్గాల మోసపూరిత కుట్రను ఆపేదెవరు? సామాన్యుడివైపు నిలిచేదెవరు? అభివృద్ధి పేరుతో జరుగుతున్న యీ రకమైన పాలకవర్గాల దళారీ కుట్రను ప్రజాస్వామికవాదులు, మేధావివర్గం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. మనకున్న వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇప్పటికే వ్యవసాయం నుండి సన్నకారు, చిన్నకారు రైతులు దూరంచేయబడుతున్నారు. ఈ కార్పొరేట్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నన్ను మెరుగుపరిచేట్లు...