9, ఫిబ్రవరి 2010, మంగళవారం

విషపు వంగడం పై జన విజయం



దేశ వ్యాప్తంగా ప్రజలనుండి, శాస్త్రవేత్తలనుండి వచ్చిన బలమైన వ్యతిరేకతకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ప్రస్తుతానికి బీ.టీ, వంగ వంగడాల ప్రయోగానికి అడ్డు చెప్పింది. దీనివలన వచ్చే అదనపు దిగుబడి ఏమీ లేకపోయిన ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వస్తుందని తెలిసినా కూడా దీనిని ప్రవేశ పెట్ట చూడడం పాలకవర్గాల విదేశీ శక్తులకు దాస్య మనస్తత్వానికి నిదర్శనం. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, N.G.Os., దీనివలన లాభంకంటే నష్టం ఎక్కువని విడమరిచి చెప్పి మొత్తుకున్నా కేంద్ర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. అయినా మొక్కవోని దీక్షతో తమ నిరసనను, వ్యతిరేకతను తెలియచేయడంతో కేంద్రం నో చెప్పింది. అయినా అంతా అప్రమత్తంగా వుండి యిటువంటి విషప్రయోగాలనుండి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక్కడ మరిన్ని వివరాలు చూడొచ్చుఃhttp://economictimes.indiatimes.com/news/economy/agriculture/Government-decides-against-Bt-Brinjal-for-now/articleshow/5552374.cms

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నన్ను మెరుగుపరిచేట్లు...